కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. దాయాది పాకిస్తాన్ పై మరోసారి మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదులను తయారు చేస్తున్న ఆ దేశానికి పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. ఇంకోసారి గనుక తమ వైపు చూసినా లేదా ముట్టుకునే ప్రయత్నం చేసినా తాట తీస్తామన్నారు. ఒక్క అడుగు దాటినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
బుధవారం రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రోగులకు డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. మా భద్రతా దళాలు ఇప్పుడు ఉగ్రవాదం లేకుండా ఉండేందుకు చికిత్స చేస్తున్నామంటూ ప్రకటించారు రాజ్ సాథ్ సింగ్. భారత్ ను తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్ బొక్క బోర్లా పడిందన్నారు. ఇప్పటి వరకు ఆర్మీ దాడుల్లో 69 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చని పోయారు. వందలాది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
అయినా పాకిస్తాన్ కు, ఆ దేశ ప్రధానికి, ఆర్మీ చీఫ్ కు బుద్ది రాలేదంటూ మండిపడ్డారు రాజ్ నాథ్ సింగ్. కేవలం మూడే మూడు నిమిషాల్లో పాకిస్తాన్ లోకి జొరబడ్డామని , 13 పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేశామని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సాయుధ దళాలు నిపుణులైన వైద్యులు లాగా పని చేశారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ధర్మ యుద్దంలో భారత్ అద్భుత విజయాన్ని సాధించిందని కొనియాడారు. ఈ సందర్బంగా తాను త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.