Ramayana Movie : రణబీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణ’ సినిమా రిలీజ్ పై కీలక అప్డేట్

Ramayana : రణ్‌బీర్‌కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా కేజీఎఫ్ యశ్ రావ‌ణుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘రామాయణ’. అమీర్ ఖాన్‌తో దంగ‌ల్ వంటి భారీ బ్లాక్‌బస్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన‌ నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పదికాలాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేవిధంగా ఉండేలా మేకర్స్‌ చాలా కసరత్తు చేస్తున్నారు. మూడు భాగాలుగా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా వాటిలో రెండు భాగాల‌ విడుద‌ల తేదీల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెళ్ల‌డించారు. మొద‌టి భాగాన్ని 2026, రెండో భాగాన్ని 2027 దీపావ‌ళికి పాన్ ఇండియాగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

Ramayana Movie Updates

ప్ర‌స్తుతంఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా సినిమాలోని నటీనటులు లుక్స్‌ లీక్‌లు కాకుండా ఉండేందుకు సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. దీనికి తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం.

Also Read : Hero Yash : కోర్టు మెట్లు ఎక్కిన మరో సెలబ్రిటీ కపుల్

CinemaRamayanamTrendingUpdatesViral
Comments (0)
Add Comment