ఈ మధ్యన ఓటీటీల్లో బోల్డ్ సీరీస్ లు శర వేగంగా వస్తున్నాయి. వాటిని ఎక్కువగా ఆదరిస్తుండడంతో తీసే వాళ్లు సైతం వాటిమీదే ఫోకస్ పెడుతున్నారు. తాజాగా మరో బోల్డ్ సీరీస్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో నటించింది ఎవరో కాదు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు విక్టరీ వెంకటేశ్, రాణా దగ్గుబాటి. ఇప్పటికే రాణా నాయుడు పేరుతో సీరీస్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ సీజన్ కు మంచి ఆదరణ లభించింది. అత్యధికంగా వ్యూస్ కూడా వచ్చేశాయి. ఇంకేముంది దీనికి సీక్వెల్ గా రాణా నాయుడు సీజన్ 2 ను చిత్రీకరించడం పూర్తయింది. ట్రైలర్ కూడా వచ్చేసింది.
ఈ మేరకు మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జూన్ 13వ తేదీన బోల్డ్ సీరీస్ స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉందని వెల్లడించారు. దీనిని ప్రసారం చేస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. చాలా మంది ఈ సీరీస్ కోసం ఎదురు చూస్తుండడం ఆశ్చర్య పోయేలా చేస్తోంది. ఇది పూర్తిగా అమెరికన్ క్రైమ్ డ్రామా సీరీస్ రే డోనవన్ ఆధారంగా రూపొందించారు.
గత ఏడాదిలో విడుదలైన తర్వాత బిగ్ రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ సీక్వెల్ తీశారు. దీనిని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషలలో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఇక రాణా నాయుడు మీ ముందుకు వచ్చేస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం చూడండి అంటూ కోరింది.
ఇక ఈ సీక్వెల్ లో విక్టరీ వెంకటేశ్ నాగ నాయుడు పాత్రలో నటించాడు. తన కుటుంబం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్దమయ్యే వ్యక్తిగా పోషించాడు. ఇక ఇందులో బోల్డ్ కంటెంట్ ఉందా లేదా అనేది పూర్తిగా చూస్తే కానీ తెలుస్తుంది.