Ramayan : దేశంలో ఆధ్యాత్మికకు సంబంధించిన చిత్రాలకు గిరాకీ పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని దర్శక, నిర్మాతలు మైథలాజికల్ మూవీస్ తీసేందుకు పరుగులు పెడుతున్నారు. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరోలు రణ బీర్ కపూర్, యశ్ తో పాటు నేచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కీలక పాత్రలు పోషిస్తున్న రామాయణ్ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దీనిని రెండు పార్టులుగా తీస్తామని ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది.
Ranbir Kapoor-Sai Pallavi Ramayan Movie Updates
దమ్మున్న డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది గత ఏడాది. ఇందులో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్నా, బాబీ డియోల్ నటించారు. ఈ మూవీ రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో ఛాన్స్ లు వస్తున్నాయి వీరికి. ఇక రష్మిక మందన్నా ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక రామాయణ్(Ramayan) లో నటిస్తున్న మరో హీరో యశ్. తను ప్రస్తుతం టాక్సిక్ లో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
మరో నటి సాయి పల్లవి. తనకు ఈ ఏడాది మంచి ఫీల్ కలిగించిన మూవీ తండేల్. తను తమిళంలో నటించిన అమరన్ కూడా మంచి ఆదరణ పొందింది. నాగ చైతన్యతో కలిసి చేసిన తెలుగు మూవీ రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. రామాయణ్ మూవీకి సంబంధించి చూస్తే రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా రవణాసురుడి పాత్రలో యశ్ పోషిస్తుండడం విశేషం. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 దీపావళి పండుగ సందర్బంగా విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.
Also Read : Kolkata Students Sensational :కేన్స్ ఫెస్టివల్ కు కోల్ కతా విద్యార్థుల షార్ట్ ఫిలిం