నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలో తను మోస్ట్ పాపులర్ హీరోయిన్ . ఒక్క మూవీకి అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న నటీమణుల్లో తను కూడా ఒకరు. తను నటించిన ఇటీవలి చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఒకే ఒక్క మూవీ మాత్రం ఆశించిన మేర ఆడలేదు. అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన పుష్ప -2 రికార్డ్ బ్రేక్ చేసింది. ఇండియాలోనే అత్యధికంగా వసూలు చేసిన ఏకైక రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ. 1867 కోట్లు కలెక్షన్స్ చేసిందని పేర్కొన్నారు మైత్రీ మూవీ మేకర్స్.
అద్భుతంగా నటించి మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదే సమయంలో తను నటించిన మరో చారిత్రాత్మక మరాఠా యోధుడి జీవిత కథను ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఛావా. ఇందులో విక్కీ కౌశల్ తో తెర పంచుకుంది. ఇది రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని బడ్జెట్ కేవలం రూ. 150 కోట్లు మాత్రమే. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్ లో కీ రోల్ పోషించింది. కానీ వర్కవుట్ కాలేదు.
అంతకు ముందు నేషనల్ డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన చిత్రం యానిమల్. ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. ఇందులో సూపర్ నటనతో ఆకట్టుకుంది రష్మిక మందన్నా. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరలో తళుక్కున మెరిసింది. గీత గోవిందం తర్వాత తన పాత్రకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ప్రధానంగా సృజనాత్మకత కలిగిన దర్శకుడు కావడంతో రష్మికను చాలా కూల్ గా చూపించాడు. మంచి ఆదరణ లభిస్తోంది ఈ చిత్రానికి.