టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి వైరల్ గా మారారు. సామాజిక మాధ్యమాలలో ఇద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా రష్మిక, రౌడీ డేటింగ్ లో ఉన్నారు. వీకెండ్ పార్టీలలో అడపా దడపా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు తాము ప్రేమలో ఉన్నట్లు మాత్రం కన్ ఫర్మ్ చేయలేదు. ఈ ఇద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తాజాగా మందన్నా, దేవరకొండలు కారులో వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఇద్దరు ఫుల్ లవ్ లో ఉన్నారని, ఎంజాయ్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కెరీర్ పరంగా చూస్తే రష్మిక టాప్ లో కొనసాగుతోంది. విజయ్ మాత్రం ఇంకా భారీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తను నటించిన లైగర్ , ఖుషీ బోల్తా కొట్టింది. ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్నసూరి దర్శకత్వం వహించిన కింగ్ డమ్ లో నటించాడు. తనతో పాటు ముంబై ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ పంచుకుంది. దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు.
ఇక రష్మిక మందన్నా విషయానికి వస్తే తను పుష్ప 2లో నటించింది. ఈ సినిమా ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా రూ. 2678 కోట్లు కొల్లగొట్టింది. ఇదే ఏడాది విడుదలైన మరాఠా యోధుడి కథ ఆధారంగా తీసిన ఛావా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు ముందు వంగా సందీప్ రెడ్డి తీసిన యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. చావా రూ. 500 కోట్లను దాటేసింది. మొత్తంగా మూడు బ్లాక్ బస్టర్ గా నిలిస్తే సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ మాత్రం ఫెయిల్ అయ్యింది. రౌడీ, రష్మికల ప్రేమాయణం ఇప్పుడు మ్యారేజ్ దాకా వెళుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.