బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా తాను చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ పేర్కొంది. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ కూలి పోయిన ఘటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సాంకేతిక లోపంతో ఇటాన్ నగర్ లో కూలి పోయింది. ఈ ఘటనలో 268 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ప్రయాణీకులతో పాటు సిబ్బంది , బీజే ఆస్పత్రి క్వార్టర్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు.
ఇప్పటి వరకు డీఎన్ఏ ఆధారంగా 220 మంది మృత దేహాలను గుర్తించారు అధికారులు. ఆయా కుటుంబాలకు అప్పగించారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు దారి మళ్లడం, సాంకేతిక లోపాలతో తిరిగి రావడం, మరికొన్నింటిని రద్దు చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు టాటా గ్రూప్ కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ లోపమా లేక సాంకేతిక వైఫల్యాలా అనేది తెలియడం లేదు.
ఈ ప్రమాదంపై ఆలస్యంగా స్పందించింది రవీనా టాండన్ . తను ఇదే సంస్థకు చెందిన ఫ్లైట్ లో ప్రయాణం చేసింది. ఈ కష్ట, దుఖః సమయంలో సంయమనం పాటించాలని కోరింది. అయితే ప్రమాదాలు చెప్పి రావని, ప్రయాణాలను ఆపలేవంటూ పేర్కొంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్. తను 1991లో పత్తేర్ కే పూల్ మూవీతో సినీ ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీ, తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చింది. ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్-2లో కీ రోల్ పోషించింది.