బెంగళూరు – ఐపీఎల్ 2025 మెగా టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది రేపటి నుంచి. పాకిస్తాన్ తో ఆపరేషన్ సిందూర్ కారణంగా కొన్ని రోజుల పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రస్తావన రావడంతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మే 17 నుండి జూన్ 3వ తేదీ వరకు ఐపీఎల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన మ్యాచ్ జరగనుంది శనివారం. ఇందుకు వేదిక కానుంది బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం. ఈ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది.
గాయం కారణంగా ఆర్సీబీ స్కిప్పర్ రజత్ పాటిదార్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమయ్యాడు. దీంతో రేపు జరిగే మ్యాచ్ లో ఎవరు కెప్టెన్సీ నిర్వహిస్తారనేది ఇంకా ప్రకటించ లేదు. ఇక కోల్ కతా విషయానికి వస్తే అజింక్యా రహానే అద్భుతంగా ఆడినా తన జట్టును ప్లే ఆఫ్స్ లోకి తీసుకు వెళ్లలేక పోయాడు. అయితే ఎలాగైనా సరే ఆర్సీబీని ఓడించాలని కంకణం కట్టుకున్నాడు. దీంతో ఇరు జట్లు విజయం కోసం పోరాడనున్నాయి. మరో వైపు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్ తో ఉన్నాడు. అయితే పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనేది వేచి చూడాలి.