ఐపీఎల్ 2025 మెగా టోర్నీ పునః ప్రారంభంలో భాగంగా మ్యాచ్ ఆడకుండానే లీగ్ మ్యాచ్ రద్దయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ప్రారంభం కాకుండానే ముగిసింది. దీంతో అంపైర్లు కీలక నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను నిర్వహించలేమని స్పష్టం చేశారు. దీంతో లీగ్ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
దీని కారణంగా కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఇక ఒక పాయింట్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 పాయింట్లతో టాప్ లో నిలిచింది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా ఇంకో మ్యాచ్ ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ ను చూసేందుకు భారీ ఎత్తున చిన్న స్వామి స్టేడియంకు చేరుకున్నారు క్రికెట్ అభిమానులు. తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఓ వైపు వర్షం పడుతున్నా ఫ్యాన్స్ లెక్క చేయలేదు. టెస్టు జెర్సీలు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇవాళ కీలకమైన మరో మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి రాజస్థాన్ వైదొలిగింది.