ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ కంట‌త‌డి

ఈ విజ‌యం ఆర్సీబీ అభిమానుల‌దే

ఈ సాలా క‌ప్ ఆర్సీబీదే అంటూ నినాదాలు మిన్నంటాయి. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ 2025 ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ల‌క్ష‌కు పైగా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌న‌, కోట్లాది మంది ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పోరును చూశారు. ఎస్ఎస్ రాజ‌మౌలి పేర్కొన్న‌ట్లు ఏ జ‌ట్టు గెలిచినా హార్ట్ బ్రేక్ కావ‌డం ఖాయం అంటూ చెప్పింది నిజ‌మే. ఒక‌టా రెండా ఏకంగా 18 సంవ‌త్స‌రాలు సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు క‌ప్ ను స్వంతం చేసుకుంది.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ర‌జ‌త్ పాటిదార్ అద్భుత‌మైన నాయ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఒకానొక ద‌శ‌లో మ్యాచ్ చేజారి పోతుందున్న స‌మ‌యంలో కృనాల్ పాండ్యా, షెఫ‌ర్డ్ ల‌తో పాటు జోష‌ల్ వుడ్ ను వాడుకోవ‌డం, పంజాబ్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ కు పంపించ‌డం అద్బుత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా ఈ ఐపీఎల్ 18వ సీజ‌న్ లో స‌మిష్టిగా ఆర్సీబీ ఆడింది. త‌మ‌కు తిరుగే లేద‌ని చాటింది.

కానీ ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పు కోవాల్సింది ఒకే ఒక్క‌డి గురించి. త‌ను విరాట్ కోహ్లీ. జ‌ట్టు కోసం ప్ర‌తిసారి ఆడుతూ వ‌చ్చాడు. ప‌రుగులు చేస్తూ కీల‌క పాత్ర పోషించాడు. కానీ జ‌ట్టును ఇన్నేళ్లుగా క‌ప్ ను తీసుకు రాక పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందాడు. కానీ చివ‌ర‌కు త‌ను క‌ల‌గంటూ వ‌స్తున్నది నిజంగా సాకార‌మైంది. త‌ను మైదానం వేదిక‌గా కంట‌త‌డి పెట్టాడు. ఆనందాశ్రువులు రాల్చాడు. త‌ను చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.

Comments (0)
Add Comment