ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీకి సంబంధించి మే 26వ తేదీ వరకు చేసుకున్న ఒప్పందం మేరకు ఆయా జట్ల ఫ్రాంచైజీలు తమ జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లను విడుదల చేయాలని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐతో సహకరించాలని కోరింది.
బీసీసీఐ కార్యదర్శి జే షా చేసిన సూచన మేరకు కీలక విదేశీ ఆటగాళ్లు ఆయా జట్లకు దూరం కానున్నారు. ఐపీఎల్ లో మిగిలి పోయిన మ్యాచ్ లు మే 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంకా కొన్ని మ్యాచ్ లే మిగిలి ఉన్నాయి. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ మే 25న జరగాల్సి ఉంది. కానీ దానిని ముందుకు జరిపారు. జూన్ 3న నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా మార్చేసింది బీసీసీఐ.
ఇదే సమయంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ జూన్ 11న లార్డ్స్ లో జరగనుంది. మే 29న ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. అయితే టోర్నీ మొత్తంగా వెస్టిండీస్ ఆటగాళ్లు టోర్నీ మొత్తంగా అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు సెక్రటరీ జే షా.