Rishabh Pant : టీమిండియా టెస్టు క్రికెట్ జట్టుకు ఎవరు కెప్టెన్ అవుతారనే దానిపై చర్చ కొనసాగుతోంది. త్వరలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సారథ్యంలో సమావేశం కానుంది. ఈ కీలక భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కానున్నాడు. తాజాగా ముంబై క్రికెటర్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ కూడా గుడ్ బై చెప్పాడు. దీంతో ఎవరిని స్కిప్పర్ ను చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది బీసీసీఐ.
Rishabh Pant Best Choice as a Skipper
బెస్ట్ ఛాయిస్ గా లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. తను మిస్టర్ కూల్ గా పేరు పొందాడు. కానీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ధరకు తనను కొనుగోలు చేసింది లక్నో యాజమాన్యం. ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఆశించిన మేర తన పర్ ఫార్మెన్స్ లేక పోవడంతో ఓనర్ సంజయ్ గోయెంకా సీరియస్ గా ఉన్నాడు. జట్టు పరంగా కీలక మ్యాచ్ లలో విజయం సాధించడంతో కొంత సైలెంట్ అయ్యాడు.
ఈ తరుణంలో స్కిప్పర్ రేసులో పంత్ తో పాటు కేఎల్ రాహుల్, బుమ్రా, పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి గౌతమ్ గంభీర్ మనసులో ఎవరికి చోటు ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే కెప్టెన్ ఎవరనేది తేలి పోతుంది.
Also Read : Jasprit Bumrah Best Choice :భారత జట్టు స్కిప్పర్ బరిలో స్పీడ్ స్టర్