Robinhood : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా నితిన్ రెడ్డి(Nithin), శ్రీలీల నటించారు. జీఎస్ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య గత నెల మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన మేర ఆడలేదు. మిశ్రమ స్పందన కూడా రాలేదు. కథను తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయాడన్న అపవాదు దర్శకుడికి మిగిలింది. ఇందులో ప్రపంచ స్థాయి క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించాడు.
Robinhood Movie OTT Updates
కేతికా శర్మ స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక లవ్లీ బ్యూటీ శ్రీలీల ప్రధాన ఆకర్షణగా నిలిచింది రాబిన్ హుడ్ కి. కానీ ఈ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించ లేక పోయింది. అయితే బాక్సాఫిస్ వద్ద బోల్తా పడినా ఓటీటీ సంస్థలు రాబిన్ హుడ్(Robinhood) ను తీసుకునేందుకు ఆసక్తిని చూపించాయి. చివరకు జీ గ్రూప్ నకు చెందిన జీ5 ఓటీటీ సంస్థ తీసుకుంది. అయితే దీనిని చూడాలని అనుకున్న వాళ్లకు ఎప్పుడు వస్తుందనే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేసింది ఈ సంస్థ. తాజాగా సినీ వర్గాల మేరకు వచ్చే మే నెల మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని టాక్.
ఇదే మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ షాక్ ఇచ్చింది రాబిన్ హుడ్. వాళ్లు తీసిన పుష్ప2 రికార్డ్ సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. దీంతో తమ రేంజ్ పెరిగి పోయింది. దీనిని ఆసరాగా చేసుకుని తీసిన రాబిన్ హుడ్ కూడా తమకు లాభాలు తెచ్చి పెడుతుందని ఆశించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇదే సమయంలో స్టార్ హీరోను దృష్టిలో పెట్టుకుని నిర్మాత దిల్ రాజు తీసిన గేమ్ ఛేంజర్ బోల్తా పడింది.
రామ్ చరణ్ ఉన్నా గట్టెక్కించ లేక పోయాడు. రూ. 500 కోట్లకు పైగా నష్ట పోయినట్లు టాక్. ఇదే సమయంలో దమ్మున్న కంటెంట్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం రూ. 300 కోట్లు వసూలు చేయడంతో బతికి బయట పడ్డాడు. మొత్తంగా సినిమాలు స్టార్స్ వల్ల ఆడవని, కేవలం కంటెంట్ బాగుంటే ఆదరిస్తారని మరోసారి రుజువైంది.
Also Read : Hero Sunny Deol-Jaat :జాట్ వివాదాస్పదం సర్వత్రా ఆగ్రహం