రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుదే ఐపీఎల్ క‌ప్

చివ‌రి దాకా పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ లో అద్భుత‌మైన విజ‌యం సాధించింది..విజేత‌గా నిలిచింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. 18 ఏళ్ల సుదీర్గ విరామం త‌ర్వాత క‌ప్ కైవ‌సం చేసుకుంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ సైతం చివ‌రి బంతి దాకా పోరాడింది. శ‌శాంక్ సింగ్ చెల‌రేగి ఆడినా ఫ‌లితం లేకుండా పోయింది. త‌ను హాఫ్ సెంచ‌రీతో రెచ్చి పోయాడు. కానీ జ‌ట్టును గెలుపు తీరాల‌కు చేర్చ‌డంలో విఫ‌లం అయ్యాడు. మొత్తంగా ఈ ఫైన‌ల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగింది.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అన్న‌ట్టు ఫైన‌ల్ లో ఎవ‌రు గెలిచినా హార్ట్ బ్రేక్ కావ‌డం ఖాయ‌మ‌ని. అలాగే జ‌రిగింది. ల‌క్ష‌లాది మంది ప్రేక్ష‌కుల ముందు స‌గ‌ర్వంగా ర‌జ‌త్ పాటిదార్ సార‌థ్యంలోని ఆర్సీబీ త‌ల ఎత్తుకుని నిలిచింది. స‌మిష్టిగా రాణించింది. ఈసారి రెండు జ‌ట్లు హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. మ్యాచ్ లో భాగంగా ర‌జ‌త్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 43 ర‌న్స్ చేశాడు. మిగ‌తా ఆట‌గాళ్లు 26 ప‌రుగుల లోపు చేయ‌డంతో భారీ స్కోర్ ముందుంచింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన పంజాబ్ ప్లేయ‌ర్స్ ధాటిగానే ఆడ‌టం ప్రారంభించారు. కానీ హేజిల్ వుడ్, కృనాల్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్ కుమార్, షెఫ‌ర్డ్ ల అద్భుత‌మైన బౌలింగ్ తో పంజాబ్ ఛేద‌న‌లో చ‌తికిల ప‌డింది.

Comments (0)
Add Comment