జైపూర్ – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2025 మెగా టోర్నీ పునః ప్రారంభంలో భాగంగా బెంగళూరు వేదికగా జరగాల్సిన కీలకమైన బెంగళూరు, కోల్ కతా జట్ల మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇప్పుడు కీలకమైన మరో లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది జైపూర్. ఆదివారం సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియంలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ , శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇరు జట్ల పరంగా చూస్తే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ నిలవగా రాజస్తాన్ రాయల్స్ ఈసారి ఆశించిన మేర ప్రదర్శన లేక చేతులెత్తేసింది. చేజేతులారా మూడు మ్యాచ్ లనకు కేవలం ఒకటి రెండు రన్స్ తేడాతో పోగొట్టుకుంది. అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు రెడీ అయ్యింది. ఇక ఎవరూ ఊహించని రీతిలో మొన్నటి సీజన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు నాయకత్వం వహించి ఏకంగా ఐపీఎల్ కప్ ను అందించిన అయ్యర్..ఉన్నట్టుండి పంజాబ్ జట్టుకు మారాడు.
తన నాయకత్వంలో అద్భుతమైన విజయాలు సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో ఐపీఎల్ కప్ పై కన్నేసింది. ఇవాళ స్వంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ రాణిస్తుందా లేక పంజాబ్ చేతిలో మరోసారి ఓటమి చవి చూస్తుందా అనేది వేచి చూడాలి.