అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టిగా స‌మంత

ఆలియా భ‌ట్..దీపికా ప‌దుకొనేల‌ను దాటేసిన న‌టి

ప్ర‌ముఖ బ‌హు భాషా న‌టి స‌మంత రుత్ ప్ర‌భు సంచ‌ల‌నంగా మారారు. త‌ను భార‌త దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఏకైక న‌టిగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆలియా భ‌ట్, దీపికా ప‌దుకొనేల‌ను దాటేసింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ప్ర‌తి ఏటా జ‌నాద‌ర‌ణ పొందిన న‌టీమ‌ణుల జాబితాను ప్ర‌క‌టిస్తుంది ప్ర‌ముఖ మీడియా, వినోద సంస్థ ఓర్మాక్స్. ఇదిలా ఉండ‌గా ఎందుకు త‌ను ఆద‌ర‌ణ పొందింద‌నే దానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

దక్షిణ భారత నటి తన నటనకు మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా తాను నమ్మే అనేక ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా తాను ఒక పెద్ద బ్రాండ్‌గా మారింది. చాలా కాలంగా పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా, సమంత రుత్ ప్ర‌భు ఇటు మూవీస్ తో పాటు అటు వెబ్ సీరీస్ తో బిజీగా మారింది. ఇటీవ‌లే మ‌రో కీల‌క రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిర్మాత‌గా కూడా మారింది. త‌ను తెలుగులో శుభం అనే సినిమాను నిర్మించింది. ఇది ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇది ఊహించ‌ని స‌క్సెస్ అయ్యింది. దీంతో ఫుల్ ఖుష్ లో ఉంది ఈ భామ‌.

శుభమ్ మూవీలో కుటుంబాలు, వివాహం, మహిళలు, పితృస్వామ్యం గురించి ఒక తేలికపాటి కథ. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన శుభమ్ అంచనాలను అధిగమించింది. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. OTTలో కూడా ఈ చిత్రం అసాధారణంగా బాగా ఆడింది. మే 2025లో నిర్వహించిన సర్వేలో సమంత అలియా భట్, దీపికా పదుకొనే, కాజల్ అగర్వాల్, ఇతరులను అధిగమించి విజయం సాధించింది.

Comments (0)
Add Comment