Samantha : పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటి కానున్నారా. అవుననే సమాధానం వస్తోంది. ఈ ఇద్దరూ కలిసి కెమెరాలకు చిక్కారు. తిరుమల పుణ్య క్షేత్రంలో స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు. అయితే త్వరలో వీరు ఒక్కటి కానున్నారు. గతంలో తను ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. కొంత కాలం తర్వాత విడి పోయారు. ఇది ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.
Samantha-Raj..
తను మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది సమంత రుత్ ప్రభు(Samantha). రాజ్ నిడిమోరు వెబ్ సీరీస్ లను తీశారు. ఈ ఇద్దరూ కొంత కాలం నుంచి డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిని నిజం చేస్తూ సమంత, రాజ్ ఎయిర్ పోర్ట్ లలో, ఇతర ప్రదేశాలలో దర్శనం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేశాయి. ఇటీవల ఈ జంట కలిసి కనిపించిన తర్వాత వివాహం గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
ఇదిలా ఉండగా సమంత మెరిసే వజ్రాల ఉంగరం ధరించిన ఫోటో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. చాలా మంది అభిమానులు అది నిశ్చితార్థపు ఉంగరం అని త్వరగా భావించారు, అయితే సమంత లేదా రాజ్ ఈ వార్తను అధికారికంగా ధృవీకరించలేదు. విడాకుల తర్వాత తను ముంబైకి మకాం మార్చేసింది. ఇక్కడే ఎక్కువ కాలం గడుపుతోంది. రాజ్ నిడిమోరు గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ తీశాడు. ప్రస్తుతం హనీ బన్నీ సీరీస్ తీస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం తిరుమల దర్శనంతో బయట పడింది.
Also Read : Hero Suriya-Retro Movie :రెట్రో ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్