భారత క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్. హైదరాబాద్ వేదికగా బంగ్లాతో జరిగిన టి20 మ్యాచ్ లో తను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్స్ లు బాదాడు. అతి తక్కువ బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. కొన్ని మ్యాచ్ లకే నాయకత్వం వహించాడు.
తను బాగా ఆడుతున్న సమయంలో చేతికి గాయమైంది. దీనిని అడ్డం పెట్టుకుని పూర్తిగా పక్కన పెట్టేశాడు రాహుల్ ద్రవిడ్. తను భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో కూడా సంజూ శాంసన్ పట్ల నిర్లక్ష్యంగా, కక్ష పూరితంగా వ్యవహరించాడంటూ సంజూ ఫ్యాన్స్ మండి పడ్డారు.
తాజాగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ ను స్కిప్పర్ గా ఎంపిక చేశాడు. ఇక మరో వార్త గుప్పుమంటోంది. రాబోయే సీజన్ లో జరిగే వేలం పాటలో శాంసన్ ను తీసుకోక పోవచ్చని టాక్. పూర్తిగా యంగ్ క్రికెటర్లు, కొత్త వారిని జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఐపీఎల్ లో పూర్తి సత్తా చాటుతూ వచ్చాడు .
అయినా ముందు నుంచీ సంజూ శాంసన్ పట్ల బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ, ద్రవిడ్ వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చాక సీన్ మారింది. తను శాంసన్ కు ఛాన్స్ ఇచ్చాడు