చెన్నై – చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గెలవడంలో కుర్రాళ్ల పాత్ర ఉందన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్. వారికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా టోర్నీలో తాము ఆశించిన ఆట తీరును ప్రదర్శించలేక పోయామని చెప్పాడు. దీనికి కొన్ని కారణాలు లేక పోలేదన్నాడు. ప్రతి జట్టు గెలుపొందాలని ఆడుతుందన్నాడు. ఈ టోర్నీలో మూడు నాలుగు మ్యాచ్ లను ఒకటి లేదా 2 , 10 పరుగుల తేడాతో ఓటమి పాలైనట్లు తెలిపాడు.
ఒకవేళ తాము విజయం సాధించి ఉంటే ఇవాళ ప్లే ఆఫ్స్ కు వచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించినా తాము కూడా ఆ జట్టుతో పాటే 18వ మెగా సీజన్ నుంచి నిష్క్రమించక తప్పడం లేదన్నాడు. ఇది ఒక రకంగా బాధను కలిగించిందని చెప్పాడు సంజూ శాంసన్. ఏది ఏమైనా ఈ టోర్నీలో తమకు జెమ్ లాంటి ఆటగాడు దొరికాడని అన్నాడు. బీహార్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరు అద్భుతంగా ఉందన్నాడు.
తను సూపర్ షో చేశాడని, 4 ఫోర్లు 4 సిక్స్ లతో రెచ్చి పోయాడని 57 రన్స్ చేశాడని తనతో పాటు జైశ్వాల్ 36 పరుగులు చేయడం , ఆఖరున ధ్రువ్ జురైల్ గెలుపులో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు సంజూ శాంసన్. మొత్తంగా వైభవ్ సూర్య వంశీ, యశస్వి జైశ్వాల్ , ధ్రువ్ జురైల్ కు మంచి ఫ్యూచర్ ఉందన్నాడు.