Sekhar Kammula : భావుకత, సృజనాత్మకత కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula). తను సాయి పల్లవితో తీసిన ఫిదా గుండెలను మీటింది. 2006లో గోదావరి నేపథ్యంగా తెరకెక్కించిన చిత్రం గోదావరి. ఇందులో సుమంత్ , కమలినీ ముఖర్జీ నటించింది. విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. మూవీ మేకర్స్ తాజాగా అప్ డేట్ ఇచ్చారు. మరోసారి గోదావరి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యన సినీ ట్రెండ్ మారుతోంది. సెక్స్, హింస, మాఫియా , పాలిటిక్స్ కంటే హాయిగా ఇంటిల్లిపాది చూసే సినిమాలను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.
Sekhar Kammula-Godavari Movie…
దీంతో ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విజయవంతమైన పాత సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే శేఖర్ కమ్ముల గోదావరి చిత్రం మార్చి 1న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటించారు. ఆధునిక క్లాసిక్ చిత్రంగా పేరు పొందింది. ఇందులో రాజమండ్రి నుండి భద్రాచలం దాకా ప్రయాణించే అందమైన గోదావరి కథ. నది నేపథ్యంగా ప్రేమతో ముడి పడి ఉన్న చిత్రం కావడంతో మరోసారి సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
గతంలో ముత్యాల ముగ్గు సినిమా కూడా ఎంతగానో అలరించింది. ఇక గోదావరి చిత్రానికి కెఎం రాధాకృష్ణన్ వినసొంపైన సంగీతం అందించాడు. ఇందులోని పాటలన్నీ జనాదరణ పొందాయి. ఈ పాటలు కాలక్రమేణా ప్రేమకు నిదర్శనంగా మారాయి. ఎస్ఎస్సీ ఆర్ట్స్ బ్యానర్ పై జీవీ రాజు నిర్మించారు. విజయ్ సి కుమార్ కెమెరా మెన్ గా చేశాడు.
Also Read : Hero Bunny-Trivikram :స్టార్ హీరోతో త్రివిక్రమ్ మరో మూవీ