Siddharth: సినిమా చూడలేదనడం సిగ్గుచేటు..స్టేజ్‌పై భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్‌ !

సినిమా చూడలేదనడం సిగ్గుచేటు..స్టేజ్‌పై భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్‌ !

Siddharth: ఏషియన్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యానర్‌ పై హీరో సిద్ధార్థ్ నిర్మించిన సినిమా ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’). ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, నిమిషా సజయన్, అంజలీ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్‌(Siddharth), సహస్ర నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించింది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో నిర్వహించి ఓ అవార్డుల ప్రధానోత్సవంలో ‘చిత్తా’ చిత్రానికి గాను ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు సిద్ధార్థ్‌… ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.

Siddharth Comment

ఈ సందర్భంగా ‘చిత్తా’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. దీనిని చూసి డిస్టర్బ్‌ అయ్యామంటూ పలువురు చేసిన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. ఇటీవల హిట్‌ అయిన బాలీవుడ్‌ మూవీని కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారన్నారు. మనసుని హత్తుకునే కథతో సినిమా చేస్తే మాత్రం ఇబ్బందిగా అనిపించింది. సినిమా చూడలేకపోయామని కామెంట్స్‌ చేశారన్నారు. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం అని తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read : 12th Fail: అరుదైన ఘనత సాధించిన ‘12th ఫెయిల్‌’ సినిమా !

ChinnaSiddharth
Comments (0)
Add Comment