ఈ ఏడాది భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆడగా చిన్న బడ్జెట్ తో రూపొందించిన మూవీస్ మాత్రం కలెక్షన్ల పరంగా కెవ్వు కేక అనిపించేలా ఉండడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. నాని నిర్మించిన కోర్టు సక్సెస్ అయ్యింది. ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన సారంగపాణి జాతకం పర్వాలేదని అనిపించేలా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇదే కోవల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సింగిల్. ఇందులో శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ , కేతికా శర్మ, ఇవానా కీలక పాత్రలు పోషించారు. ఆద్యంతమూ నవ్వులు పూయించింది ఈమూవీ. దీంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
కాగా దీనిని చూసేందుకు వెయిట్ చేసిన ప్రేక్షకులకు ఉన్నట్టుండి సర్ ప్రైజ్ ఇచ్చింది ఓటీటీ సంస్థ. డిక్లేర్ చేయకుండానే స్ట్రీమింగ్ చేసింది. ఇది కూడా ప్రచారంలో, మార్కెట్ లో ట్రెండ్ అని అనుకోవచ్చు. మొత్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం సింగిల్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేకించి వెన్నెల కిషోర్ మరోసారి తన కామెడీని పండించాడు. తనతో పాటు శ్రీ విష్ణు సైతం పోటీ పడి నటించాడు.
సింగిల్ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించారు. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ బ్యానర్ పై దీనిని విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. మొత్తంగా కామెడీ పంచులు కావాల్సినంతగా ఉన్నాయి ఈ చిత్రంలో. కథ సాధారణంగానే ఉన్నప్పటికీ ఇంటిల్లిపాదిని నవ్విస్తుందనడంలో సందేహం లేదు. ఇంకెందుకు ఆలస్యం ఓటీటీలో చూసేయండి హాయిగా.