విశ్వ విజేత‌కు రూ. 30 కోట్ల ప్రైజ్ మ‌నీ

టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో ఊహించ‌ని గిఫ్ట్

లార్డ్స్ వేదిక‌గా టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు సంబంధించి ఛాంపియ‌న్ షిప్ స‌మ‌రం ముగిసింది. విశ్వ విజేత‌గా ఈ ఫార్మాట్ లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టెంబా బావుమా నేతృత్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు బ‌ల‌మైన ఆస్ట్రేలియాను ఓడించింది. స్టార్ బౌల‌ర్ క‌గిసో ర‌బాడా 9 వికెట్లు తీస్తే ఏడెన్ మార్క్రార‌మ్ సెంచ‌రీతో క‌దం తొక్కితే కెప్టెన్ బావుమా అద్భుతంగా ఆడుతూ అడ్డు గోడ‌లా నిలిచాడు. కీల‌క‌మైన 66 ప‌రుగుల‌తో జ‌ట్టును విజ‌యం సాధించ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు.

టెస్టు ఛాంపియ‌న్ గా అవ‌త‌రించిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ఏకంగా అక్ష‌రాలా భార‌తీయ రూపాయ‌ల‌లో రూ. 30 కోట్లు ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. 3.6 మిలియ‌న్ డాల‌ర్లు . ఇది ఈ ఫార్మాట్ లో అత్య‌ధిక పారితోష‌క‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు రూ. 18 కోట్లు ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. అంటే 2.16 మిలియ‌న్ డాల‌ర్లు. ఇక ఈ సీజ‌న్ లో అత్యుత్త‌మ టెస్టు జ‌ట్టుగా నిలిచింది భార‌త క్రికెట్ జ‌ట్టు. ఆ జ‌ట్టుకు రూ. 12 కోట్లు ద‌క్కాయి. ఈ విష‌యాన్ని ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్బంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు స్కిప్ప‌ర్ బావుమా మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌మ‌ను ఎన్ని ర‌కాలుగా అవ‌మానించాలో అన్ని ర‌కాలుగా గేలి చేశారంటూ వాపోయాడు. అయినా మొక్క‌వోని ఆత్మ విశ్వాసంతో తాము విజేత‌లుగా నిలిచామ‌ని చెప్పాడు. దాదాపు క‌ప్ అంచుల దాకా చాలా సార్లు వ‌చ్చామ‌ని, కానీ అందుకోలేక పోయామ‌ని, ఈ ఏడాది మాత్రం ఆ క‌ల నెర‌వేరింద‌న్నాడు. భారీ ఎత్తున ప్రైజ్ మ‌నీ అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. ఈ డ‌బ్బుల‌ను తాము త‌మ దేశంలో స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌కు వాడుతామ‌ని ప్ర‌క‌టించాడు.

Comments (0)
Add Comment