Sr NTR : నందమూరి తారక రామారావు(Sr NTR) పేరు చెబితే చాలు గుండె ఉప్పొంగుతుంది. తను ఇవాళ భౌతికంగా లేరు. కానీ ఆయన ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కోట్లాది మంది అభిమానులను కలిగిన, లక్షలాది మంది కార్యకర్తల బలగం కలిగిన పార్టీగా నేటికీ తన ప్రాదాన్యతను కలిగి ఉంది. తాజాగా మరోసారి ఎన్టీఆర్ పేరు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణంగా రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా కడప కేంద్రంగా టీడీపీ మహానాడుకు సిద్దం అవుతోంది. ఈ విషయాన్ని పార్టీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మే 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది పార్టీ.
Sr NTR Memorable..
ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగింది. ఇక తెలుగుదేశం పార్టీని అతి తక్కువ కాలంలో పవర్ లోకి తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు. 1982, మార్చి 29న ప్రారంభించాడు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాడు. ప్రజా రంజక పాలనను అందించాడు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో తాను తెలుగుదేశం పార్టీని స్థాపించానని ప్రకటించాడు నందమూరి తారక రామారావు.
చైతన్య రథంపై సుడిగాలి పర్యటన చేశాడు. కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి చరిత్ర సృష్టించాడు. సినిమా వాళ్లకు రాజకీయాలు ఏం తెలుసు అంటూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తను పదవిని కోల్పోయాడు. తిరిగి పవర్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో లక్ష్మీ పార్వతిని తిరుపతి వేదికగా పెళ్లి చేసుకుని ఆశ్చర్య పరిచాడు. వెన్ను పోటుకు గురయ్యాడు. చివరకు గుండె పోటుతో నిష్క్రమించాడు.
Also Read : TDP Mahanadu Interesting :తెలుగుదేశం ప్రస్థానం చారిత్రాత్మకం