పశ్చిమాషియాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడుల పరంపర కొనసాగుతోంది. భారీ ఎత్తున ఆస్తి,ప్రాణ నష్టం జరిగింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ దారికొస్తే సరి లేక పోతే ప్రపంచంలో అణ్వాయుధాలను తయారు చేసే దేశాలన్నింటిని సర్వ నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో అమెరికా కూడా ఉంది. కానీ భారత్ మాత్రం లేదు.
మంగళవారం కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ యుద్ధకాల చీఫ్ ఆఫ్ స్టాఫ్, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షాద్మానీని రాత్రిపూట దాడిలో హతమార్చినట్లు వెల్లడించింది. వైమానిక దళ యుద్ధ విమానాలు టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న మానవ సహిత ప్రధాన కార్యాలయంపై దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది.
ఇరాన్ సైనిక నాయకత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఇటీవలి వారాల్లో ఇది రెండవసారి దాడి జరపడం. చని పోయిన షాద్మానీ యుద్ధ సిబ్బంది చీఫ్గా, సాయుధ దళాల అత్యవసర కమాండ్కు కమాండర్గా పనిచేశాడు. అంతే కాకుండా రివల్యూషనరీ గార్డ్స్ , ఇరానియన్ సైన్యానికి నాయకత్వం వహించాడు. తను ఇజ్రాయెల్ ను దెబ్బ తీయాలని కుట్ర పన్నాడని, అంతే కాకుండా తమ దేశం వైపు సాయుధ దళాలను ప్రేరేపించేలా చేశాడని ఆరోపించింది. అందుకే తనను మట్టుబెట్టామని ప్రకటించింది.
ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ అణ్వాయుధాల ముప్పును తిప్పికొట్టడానికి లక్ష్యంగా చేసుకున్న సైనిక చర్య అయిన ఇరాన్పై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించినప్పుడు శుక్రవారం మరణించిన జనరల్ ఘోలం అలీ రషీద్ స్థానంలో షాద్మానీ గతంలో నియమితులయ్యారు.