శ్రీలంక – శ్రీలంక స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన చేశాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అధ్యాయం ముగిసిందని చెప్పక తప్పదు. ఇన్నేళ్లు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ , ప్రత్యేకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుకు , తన సహచరులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.
కృతజ్ఞత కలిగిన హృదయంతో నిష్క్రమిస్తున్నానని చెప్పేందుకు బాధ పడుతున్నానని తెలిపాడు ఏంజెలో మాథ్యూస్. తనను అభిమానించే వేలాది మందిని దుఖఃంలో ముంచెత్తింది. జూన్లో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ తన కెరీర్ లో చివరి మ్యాచ్ అవుతుందని స్పష్టం చేశాడు. ఈ సందర్బంగా మాథ్యూస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక అధ్యాయం ముగిసిందని, ఆట పట్ల తనకున్న ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.
శ్రీలంక తరపున గత 17 సంవత్సరాలుగా క్రికెట్ ఆడటం నాకు లభించిన అత్యున్నత గౌరవం. గర్వం కూడా ఉందన్నాడు. జాతీయ జెర్సీ ధరించినప్పుడు కలిగే దేశభక్తి, దాస్యం అనే భావనకు ఏదీ సరిపోదన్నాడు. నేను క్రికెట్కు నా సర్వస్వం ఇచ్చాను. క్రికెట్ నాకు ప్రతిఫలంగా ప్రతిదీ ఇచ్చింది . నన్ను గొప్ప క్రికెటర్ ను చేసింది. లక్షలాది అభిమానులను పొందేలా చేసిందన్నాడు మాథ్యూస్.