అంద‌రి క‌ళ్లు ద‌ర్శ‌క ధీరుడి పైనే

ప్రిన్స్ మ‌హేష్ బాబుతో షూటింగ్ బిజీ

భార‌తీయ సినిమాలో సంచ‌ల‌నం రేపిన ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌలి అలియాస్ జ‌క్క‌న్న‌. త‌ను తీసింది కొన్ని చిత్రాలే కానీ ప్ర‌తి మూవీ ఏదో ఒక మెస్సేజ్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. నానితో ఈగ తీశాడు. ఇది మంచి ప్ర‌యోగం. అంత‌కు ముందు మాస్ మ‌హారాజాతో విక్ర‌మార్కుడు తీస్తే అది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ తో య‌మ‌దొంగ తీశాడు. క‌మెడియ‌న్ సునీల్ ను పెట్టి మ‌ర్యాద రామ‌న్న చిత్రం తీస్తే అంద‌రూ విస్తు పోయారు.

ఆ త‌ర్వాత పూర్తిగా కొన్ని పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన ప్ర‌భాస్ ను అద్భుత‌మైన పాత్ర‌కు ఎంపిక చేశాడు. ఇతిహాసం ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఇది సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కాసులు కొల్ల‌గొట్టింది. ఇండియ‌న్ మూవీ రంగాన్ని షేక్ చేసింది. దీనికి సీక్వెల్ గా తీసిన బాహుబ‌లి 2 కూడా దుమ్ము రేపింది. ఆ త‌ర్వాత త‌ను తీసిన ఆర్ఆర్ఆర్ (ర‌ణం -రుధిరం-రౌద్రం) మూవీ కోట్లు కురిపించింది. ఆ త‌ర్వాత హాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ను విస్తు పోయేలా చేసింది. యావ‌త్ సీనీ ప్ర‌పంచంలో క‌ల‌గా మిగిలి పోయిన ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది జ‌క్క‌న్న తీసిన చిత్రం.

ఆ త‌ర్వాత త‌న పేరు లోక‌మంత‌టా వ్యాపించింది. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. పూర్తిగా సోషియో ఫ్యాంట‌సీ చిత్రంగా ప్రిన్స్ మ‌హేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29 పేరుతో మూవీని స్టార్ట్ చేశాడు. తొలి షెడ్యూల్ పూర్త‌యింది. రెండో షెడ్యూల్ కొన‌సాగుతోంది. ఓ వైపు ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. ఇంకో వైపు చిత్రీక‌ర‌ణ‌పై ఫోక‌స్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త‌ను సినిమా తీస్తే క‌నీసం 2 ఏళ్లు ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ప్పుడు చేయ‌డు. కూల్ గా చేసుకుంటూ పోతాడు. చిత్రం రిలీజ్ చేశాక‌..బాక్సులు బ‌ద్ద‌లు కావ‌డం మొద‌లు పెడ‌తాయి. ఇదీ త‌న స్ట్రాట‌జీ. ఇందులో అందాల తార ప్రియాంక చోప్రా త‌ళుక్కున మెర‌వ‌నుంది.

Comments (0)
Add Comment