కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకడు లోకేష్ కనగరాజ్. తను తమిళ సినీ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు కూలీ. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు విపరీతమైన స్పందన లభించింది. తన టేకింగ్ , మేకింగ్ లో ఎక్కువగా ఫోకస్ పెడుతుండడం, అంచనాలకు మించి మార్కెట్ లో ఆదరణ లభించడంతో బ్లాక్ బస్టర్ పక్కా అనే టాక్ వినిపిస్తోంది సినీ ఇండస్ట్రీలో. ఇది పక్కన పెడితే కూలీ ఇంకా రిలీజ్ కాకుండానే మరో మూవీ కోసం కథను సిద్దం చేశాడట లోకేష్ కనగరాజ్. తను ఎక్కువగా మాట్లాడడు. కానీ చేతల్లో చూపిస్తాడు. తన ఆలోచనలను పకడ్బందీగా తెరపై వచ్చేలా చూస్తాడు. ఇదీ తన స్పెషాలిటీ.
ఈ మధ్యన కోలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ బయటకు వస్తున్నారు. వారిలో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఒక్క కూలీ మూవీ ప్రమోషన్స్ కోసం కొంత కాలం పాటు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. అంత కమిట్ మెంట్ తనది. ప్రస్తుతం తను సంచలనంగా మారాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కీలక ప్రకటన చేశాడు. తాను లోకేష్ తో కలిసి పని చేయబోతున్నట్లు వెల్లడించాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు.
తను గతంలో తమిళ సినీ దర్శకుడు మురుగదాస్ తో మూవీ తీశాడు. అదే గజిని. ఇది సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు లోకేష్ ను ఎంచుకోవడంతో అందరి కళ్లు ఈ యంగ్ డైరెక్టర్ పై పడ్డాయి. ఈ ఇద్దరి మధ్య బాండింగ్ కూలీ షూటింగ్ సమయంలో ఏర్పడింది. ఇదే సమయంలో లోకేష్ కనగరాజ్ కథ చెప్పడంతో ఫుల్ ఫిదా అయ్యాడు స్టార్ హీరో. ఇంకేం వెంటనే ఓకే చెప్పేయడం, సంతకం కూడా చేశాడట. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ న్యూస్ ట్రెండింగ్ లో ఉంది.