ముంబై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అద్భుతమైన విజయాలు సాధించింది. బలమైన జట్లకు షాక్ ఇస్తూ ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ కీలకమైన పోరు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు కప్ గెలవని జట్లు అంతిమ పోరాటానికి సిద్దమయ్యాయి ఆర్సీబీ, పీబీకేఎస్. ఈ సందర్బంగా ఎవరు గెలిచినా అది ఓ చరిత్రే అవుతుంది. ఇది పక్కన పెడితే ఎక్కువ మార్కులు క్రికెట్ విశ్లేషకులు, విమర్శకుల నుంచి వస్తున్నాయి.
దీనికి కారణం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తను గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ స్కిప్పర్ గా ఉన్నాడు. ఆ జట్టును విజయ పథంలో నడిపించాడు. ఏకంగా ఐపీఎల్ కప్ ను జట్టు ఓనర్స్ బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్ , జూహ్లీ చావ్లాకు. కానీ ఎవరూ ఊహించని రీతిలో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఓనర్ ప్రీతి జింతా శ్రేయస్ అయ్యర్ ను.
గత 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను ఈసారి జరుగుతున్న 18వ ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ కు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు. క్వాలిఫయర్ 2లో బలమైన ముంబై జట్టును మట్టి కరిపించడంలో సూపర్ షో చేశాడు. ఈ సందర్బంగా భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను.