గిల్ టెస్టు కెప్టెన్సీపై స‌న్నీ కామెంట్స్

ఇంగ్లండ్ తో టెస్టు సీరీస్ ప్ర‌మాద‌క‌రం

ముంబై – మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇంగ్లండ్ జ‌ట్టుతో ఆడే భార‌త జ‌ట్టు టెస్టు స్క్వాడ్ ను ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా ముంబై స్టార్ క్రికెట‌ర్, గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ ను జ‌ట్టుకు నాయ‌కుడిగా ప్ర‌క‌టించారు ఎంపిక క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్.

ఇంగ్లండ్ జ‌ట్టుతో త‌న‌ను ఎంపిక చేయ‌డం మంచిదేన‌ని, కానీ నాయ‌క‌త్వం వ‌హించ‌డం అనేది పూర్తిగా స‌వాల్ అని పేర్కొన్నాడు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్. ఐపీఎల్ లో జ‌ట్టుకు కెప్టెన్సీ నిర్వ‌హంచ‌డం మామూలేన‌ని కానీ ఇత‌ర దేశాల‌తో ఆడ‌డం, నాయ‌క‌త్వం వ‌హించ‌డం అత్యంత క్లిష్ట‌మైన‌ద‌ని హెచ్చ‌రించాడు. ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా ఉండ‌గా టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో సూప‌ర్ షో ప్ర‌ద‌ర్శించడ‌మే కాకుండా ప్ర‌పంచ క్రికెట్ లో టాప్ ప్లేయ‌ర్లుగా కొన‌సాగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ తాము ఈ ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పెద్ద వెలితి ఏర్ప‌డింది. ఇద్ద‌రూ కొన్నేళ్లుగా ఓపెన‌ర్స్ గా ప‌రుగుల వ‌ర‌ద పారించారు. ఇండియా సాధించిన కీల‌క విజ‌యాల‌లో భాగ‌స్వామ్యం పంచుకున్నారు.

ఈ త‌రుణంలో ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే దానికి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చెక్ పెట్టింది. సాయి సుద‌ర్శ‌న్ , క‌రుణ్ నాయ‌ర్ తో పాటు స్టార్ పేస‌ర్ అర్ష్ దీప్ సింగ్ ను ఎంపిక చేశారు. వీరి చేరిక‌తో జ‌ట్టు మ‌రింత బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నాడు అగార్క‌ర్. గిల్ కు తోడుగా రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌న్నాడు.

Comments (0)
Add Comment