ఐపీఎల్ ముగిసింది. ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులతో అలరించాడు సూర్య కుమార్ యాదవ్. తను అద్భుతమైన షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో తను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్బంగా తనకు రూ. 15 లక్షల బహుమతి లభించింది. ముంబై ఇండియన్స్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. జట్టు క్లిష్ట సమయాల్లో తను ఆదుకున్నాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు సూర్య భాయ్.
ఇదే సమయంలో నికోలస్ పూరన్ కు సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ కు ఎంపికయ్యాడు. రూ10 లక్షలు దక్కాయి. ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్ అవార్డు సాయి సుదర్శన్ కు దక్కింది. రూ. 10 లక్షలు క్యాష్ ప్రైజ్ లభించింది. సిరాజ్ గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. రూ. 10 లక్షలు రివార్డు వరించింది. కమింద్ మెండీస్ కు క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. తనకు రూ. 10 లక్షలు వచ్చాయి. ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దక్కింది. రూ. 10 లక్షలు లభించాయి.
జితేశ్ శర్మకు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తనకు లక్ష రూపాయలు లభించాయి. ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తనకే దక్కింది. మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు చేసినందుకు గాను ప్రియాన్ష్ ఆర్యకు రూ లక్ష రివార్డుకు ఎంపికయ్యాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న కృనాల్ పాండ్యాకు గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతే కాకుండా తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యాడు. రెండు అవార్డులకు కలిపి తనకు రూ. 6 లక్షలు లభించాయి.