గుజరాత్ – మెగా టోర్నీ టాటా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కు వేదిక కానుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం. దాదాపు లక్షకు పైగా కెపాసిటీ కలిగిన ఈ కీలక పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ జరిగేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే బెట్టింగ్ లు మొదలు పెట్టారు. క్రికెట్ విశ్లేషకులు అంచనాలు ప్రారంభించారు. ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.
విచిత్రం ఏమిటంటే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఆ జట్టు మేనేజ్ మెంట్ ఊహించని రీతిలో భారీ ధరకు కొనుగోలు చేసింది శ్రేయస్ అయ్యర్ ను. తన సారథ్యంలో కోల్ కతా జట్టును విజయ పథంలో నడిపించాడు గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో. ఏకంగా కప్ ను తీసుకు వచ్చాడు. తాజాగా తనను వేలం పాటలో అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అయ్యర్ క్వాలిఫయర్ -2 లో దుమ్ము రేపాడు. దగ్గరుండి తన జట్టును ఫైనల్ కు చేర్చాడు.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఊహించని విధంగా అద్భుతంగా ఆడింది. సమిష్టిగా రాణించింది. ఏకంగా ఫైనల్ కు చేరుకుంది. విచిత్రం ఏమిటంటే క్వాలిఫయర్ -1లో ఇదే పంజాబ్ కింగ్స్ ను భారీ తేడాతో ఓడించింది. ఆ జట్టు పూర్తి బలంగా ఉంది. ఎలాగైనా కప్ ను ఎగరేసుకు పోవాలని పట్టుదలతో ఉంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది.