శుభ్ మ‌న్ గిల్ కు ల‌క్ క‌లిసొస్తుందా

టీమిండియా కెప్టెన్సీ రేసులో క్రికెట‌ర్

హైద‌రాబాద్ – సీనియ‌ర్ క్రికెట‌ర్ , భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి త‌ప్పు కోవ‌డంతో పాటు టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్ప‌డంతో బీసీసీఐ ఎవ‌రిని స్కిప్ప‌ర్ గా ఎంపిక చేస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం ఈ రేసులో యంగ్ క్రికెట‌ర్లు పోటీ ప‌డుతున్నారు. వారిలో ముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్, స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ ఉన్నారు.

వీరితో పాటు సీనియ‌ర్ క్రికెట‌ర్ డిల్లీ క్యాపిట‌ల్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ , గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న శుభ‌మ్ మ‌న్ గిల్ ఉన్నారు. ప్ర‌స్తుతం టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్న గంభీర్ ఫుల్ ఫోక‌స్ ఎంపిక‌పై పెట్టాడు. త్వ‌ర‌లోనే బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ స‌మావేశం కానుంది. ఈ మేర‌కు అజిత్ అగార్క‌ర్ తో పాటు బీసీసీఐ స‌భ్యులు , గౌత‌మ్ గంభీర్ పాల్గొంటారు. టీమిండియా టెస్టు జ‌ట్టు కెప్టెన్ ను ఎంపిక చేస్తారు.

తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్ 2025లో గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ టాప్ లో కొన‌సాగుతోంది. త‌న నాయ‌క‌త్వం కార‌ణంగానే ఆ జ‌ట్టు ఫైన‌ల్ రేసులో నిల్చుంది. దీంతో కెప్టెన్సీ ప‌రంగా వంద మార్కులు ప‌డ్డాయి గిల్ కు. త‌ను అయితేనే బావుంటుంద‌నే చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది. గిల్ లేదా పంత్ లేదా అయ్య‌ర్ , పాండ్యా లో ఎవ‌రో ఒక‌రికి ఛాన్స్ ద‌క్క‌నుంది. మ‌రి హెడ్ కోచ్ ఎవ‌రి వైపు ఉంటాడో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

Comments (0)
Add Comment