CM Revanth : హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth) అధికారిక ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. ఈనెల 14న ఢిల్లీకి సీఎం వెళ్లనున్నారు. 15,16 తేదీలలో దేశ రాజధానిలో ఉంటారు. 15వ తేదీన ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి 17న సింగపూర్ కు వెళతారు.
CM Revanth Reddy Tour…
ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. 19 న సింగపూర్ నుంచి దావోస్ కు ప్రయాణం చేస్తారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. సింగపూర్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు సీఎం. తాను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కొలువు తీరి సంవత్సరం పూర్తయింది. ఇప్పటికే ఆయన పలుమార్లు అమెరికాలో పర్యటించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు, చైర్మన్లతో భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకు రావడంలో భాగంగానే తాను దావోస్ లో జరిగే ఫోరంకు హాజరవుతున్నానని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ , ఫార్మా, టెలికాం, టెక్నాలజీ సెక్టార్లలో మరిన్ని కంపెనీలు వచ్చేలా చేయడం తన ముందున్న లక్ష్యమని ప్రకటించారు.
Also Read : Music Master AR Rahman : అనిరుధ్ పై ఏఆర్ రెహమాన్ కామెంట్స్