Telugu New Combos : టాలీవుడ్ కొత్త కాంబోస్ తో వస్తున్న సినిమాలు ఇవే

ది రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ కూడా మాళవిక మోహనన్‎తో తొలిసారి జతకడుతున్నారు...

New Combos : పొలిటికల్‌ సక్సెస్‌ తరువాత సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్న పవన్‌ కల్యాణ్ 2025లో హరి హర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిథి అగర్వాల్‌ పవన్‌కు జోడీగా నటిస్తున్నారు. బందిపోటును ప్రేమించే యువరాణిగా నటిస్తున్నారు నిథి. గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా కొత్త జోడీని సెట్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఆర్సీ 16 షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ, ఆ సినిమాలో ఫస్ట్ టైమ్‌ జాన్వీ కపూర్‌తో జోడీ కడుతున్నారు. చిరు, శ్రీదేవి జోడీ సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మ్యాజిక్‌.. చరణ్‌, జాన్వీ విషయంలోనూ రిపీట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌.

Telugu New Combos Movies

వీరిద్దరూ మాత్రమే కాదు.. ది రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ కూడా మాళవిక మోహనన్‎తో తొలిసారి జతకడుతున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, నిథి అగర్వాల్‌ కూడా హీరోయిన్స్. హనుతో చేస్తున్న సినిమాలో కూడా కొత్త భామ ఇమాన్వితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు డార్లింగ్. అన్ని కుదిరితే ఇది కూడా 2025లోనే వస్తుంది. అక్కినేని హీరోలు ఇద్దరితో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాతో పాటు అఖిల్, మురళీ కిశోర్‌ అబ్బూరు సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా కొత్త కాంబోలో ఆడియన్‌ ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ మూవీ వార్‌ 2లో నటిస్తున్న తారక్‌, ఆ సినిమాలో కిరాయా అద్వానీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో కియారా, తారక్‌కు జోడీగా కనిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : Mura Movie : ఓటీటీ లో హల్చల్ చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా

New MoviesTollywoodTrendingUpdatesViral
Comments (0)
Add Comment