ఐపీఎల్ విజేత‌కు రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ

ర‌న్న‌ర‌ప్ పంజాబ్ కు రూ. 12.5 కోట్లు

అహ్మ‌దాబాద్ – ఐపీఎల్ 2025 టోర్నీ ముగిసింది. విజేత‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్య‌ధిక ప్రైజ్ మ‌నీని అందుకుంది. పంజాబ్ ను 6 ప‌రుగుల తేడాతో ఫైన‌ల్ మ్యాచ్ లో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా ఆ జ‌ట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ కింద ల‌భించింది. అంతే కాకుండా ఇత‌ర‌త్రా అవార్డులు కూడా ద‌క్కాయి. భారీ మొత్తంలో ఇత‌ర కంపెనీలు సైతం బ‌హుమానాలు అంద‌జేశాయి. ఇక విరాట్ కోహ్లీ మార్కెట్ వాల్యూ ప్ర‌స్తుతం రూ. 1000 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా.

ఇక ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు రూ. 12.5 కోట్ల ప్రైజ్ మ‌నీ ల‌భించింది. ఆ జ‌ట్టు చివ‌రి బంతి వ‌ర‌కు పోరాడింది. త‌క్కువ ప‌రుగుల‌కే ఓట‌మి పాలు కావ‌డం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఆ జ‌ట్టు ఓన‌ర్ , ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింతా కంట‌త‌డి పెట్టింది. ఆ జ‌ట్టును కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఒంటి చేత్తో న‌డిపించాడు. 11 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్ కు చేర్చడంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇదే స‌మ‌యంలో అద్బుత‌మైన నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నాడు. కానీ బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ త‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. టెస్టు జ‌ట్టుకు ఎంపిక కాక పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఫ్యాన్స్.

ప్ర‌ధానంగా కోచ్ గౌత‌మ్ గంభీర్ ను ఏకి పారేశారు. త‌న వ‌ల్ల చాలా మంది ఎంపిక కాలేక పోతున్నారంటూ మండిప‌డ్డారు. అయినా డోంట్ కేర్ అంటూ ప‌ట్టంచు కోలేదు.

Comments (0)
Add Comment