యోగా వ‌రం జీవితం ఆనంద‌మ‌యం

తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్

తిరుప‌తి – పీఎం మోదీ, సీఎం చంద్ర‌బాబు పిలుపు మేర‌కు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించామ‌న్నారు తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్, ఎస్పీ హ‌ర్ష వ‌ర్ద‌న్ రాజు. యోగా చివరి రోజున రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, విద్యా శాఖ లతో సంయుక్తంగా తిరుపతి తారకరామ స్టేడియంలో వివిధ కాలేజిలకు చెందిన విద్యార్థులు, రెవిన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రజా ప్రతినిధిలతోపాటు నగర పౌరులతో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6,200 లోకేషన్స్ లో 14 యూనివర్సిటీ లను కలుపుకుని 3,500 స్కూల్స్ లో 10 లక్షల మంది యోగా కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు.

అంతర్జాతీయ యోగాను జిల్లా వ్యాప్తంగా ఒక పండుగలా జరుపు కోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
యోగాను ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళామన్నారు. యోగా అనేది మనంద‌రి జీవితం లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
ప్రతి రోజు యోగా చేయడం వల్లన మనకు తెలియకుండా అనేక ఉపయోగాలు ఉంటాయన్నారు.

ప్రతి రోజు మన జీవితం లో భాగంగా ఉదయం పూట 45 నిముషాలు పాటు యోగా చేయాలన్నారు. కాలేజిలు మొదలౌతున్న తరుణంలో టీచ‌ర్లు ర్యాగింగ్ భూతం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నూతనంగా కాలేజిలకు వస్తున్న విద్యార్థులకు సీనియర్లు సోదరభావం తో స్వాగతం పలికాలని సూచించారు. ఎన్నో ఆశలతో కాలేజిలకు వస్తున్న విద్యార్థులను ర్యాగింగ్ అనే భూతం వెంటడరాదన్నారు. కళాశాల లో ఉంటున్న సిబ్బంది ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Comments (0)
Add Comment