శరణార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. దీనినే కథగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. కానీ బిగ్ మూవీస్ తో పోటీ పడేలా ఆదరణ చూరగొంది. కలెక్షన్స్ సూపర్ గా వచ్చాయి. సినీ విమర్శకులు సైతం ఈ చిత్రానికి మంచి మార్కులే ఇచ్చారు. టూరిస్ట్ ఫ్యామిలీ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ చివరకు జియో హాట్ స్టార్ వశం చేసుకుంది. ఇటు థియేటర్లలో దుమ్ము రేపిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సైతం సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతోంది.
శశి కుమార్ తో పాటు వర్దమాన సినీ నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించింది. ఆద్యంతమూ హృదయాలను హత్తుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు అభినవ్ జీవింత్. విచిత్రం ఏమిటంటే ఓటీటీలతో పాటు టాకీసులలో సినిమా చూసేందుకు ఎక్కువగా ప్రేక్షకులు ఎగబడుతుండడం ఒకింత సినీ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది.
కేవలం 7 రోజుల్లో టూరిస్ట్ ఫ్యామిలీ రూ. 74 లక్షల నికర లాభాలను ఆర్జించింది. ఇక జూన్ 2వ తేదీన జియో హాట్ స్టార్ లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు రూ. 26 లక్షలు సంపాదించింది. ఈ చిత్రం పూర్తిగా శరణార్థుల జీవితానికి సంబంధించింది. మిథున్ జై శంకర్ , కమలేష్ ముఖ్య పాత్రలు పోషించారు. కథ చెప్పడంలో తనదైన ముద్ర వేశాడు దర్శకుడు. డైరెక్టర్ కు ఇదే తొలి చిత్రం. కానీ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు ప్రముఖ దర్శకులంతా.