అమెరికా – యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్లనే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్దం ఆగిందన్నారు. తాను జోక్యం చేసుకోక పోయి ఉంటే మరింత పెను ప్రమాదం జరిగి ఉండేదన్నారు. దీనిని ఆయన భారీ విజయంగా అభివర్ణించారు. ఉద్రిక్తతలు ఇరు దేశాలకు మంచిది కాదని తాను సూచించానని, అందుకే ఒప్పుకున్నాయని చెప్పారు.
గల్ఫ్ పర్యటనను ముగించుకుని అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా ఎయిర్ పోర్ట్ లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్ లతో వ్యక్తిగతంగా మాట్లాడానని, చివరకు తాను చేసిన సూచనలతో దిగి వచ్చారంటూ ఇది వారి విజయం కాదని తన విజయంగా పేర్కొన్నారు ట్రంప్. భారత్, పాక్ కాల్పుల విరమణకు అమెరికా మధ్య వర్తిత్వం వహించిందంటూ చెప్పడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
నేనే చేశానని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ట్రంప్. అయితే అమెరికా దేశ అధ్యక్షుడు చేసిన తాజా కామెంట్స్ పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ కు ఇంకో దేశంతో చెప్పించు కోవాల్సిన అవసరం లేదన్నారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ఇది మంచి పద్దతి కాదని అమెరికాకు సూచించింది. పాకిస్తాన్ తనంతకు తానుగా చర్చలకు సిద్దమని డీజీఎంఓ నుంచి ఫోన్ చేశారని వెల్లడించారు.