TTD : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. మే 15 నుండి సిఫార్సు లేఖల ఆధారంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన MPలు, MLAలు, MLCల సిఫార్సు లేఖలను సమర్పించే భక్తులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
TTD Announce
వేసవి సెలవుల రద్దీ కారణంగా, తిరుమలను సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ఇటీవలి వారాల్లో, అధిక రద్దీ కారణంగా, TTD సిఫార్సు లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపి వేశామన్నారు. ఇందులో భాగంగా సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి, సజావుగా రద్దీ నిర్వహణను నిర్ధారించడానికి ప్రోటోకాల్ VIPలకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని అనుమతించామన్నారు.
రద్దీ క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి లేఖలను స్వీకరించే విధానం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు ఈవో . కాగా వేగవంతమైన దర్శనం కోసం సిఫార్సులపై ఆధారపడే భక్తులకు ఈ మార్పు కొంత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.
Also Read : PM Modi Interesting : సాయుధ దళాలకు మోదీ సెల్యూట్