రాజస్థాన్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చివరి దాకా పోరాడింది. కేవలం 10 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. చివరలో ఒత్తిడికి తట్టుకోలేక కీలక వికెట్లు కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 219 రన్స్ చేసింది 5 వికెట్లు కోల్పోయి.
నేహాల్ వధేరా రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తను 70 రన్స్ చేయగా డెత్ ఓవర్లలో శశాంక్ సింగ్ ఏకంగా 59 రన్స్ పిండుకున్నాడు. మూడు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తను కీలక 30 పరుగులు చేశాడు. దీంతో భారీ స్కోర్ ముందు ఉంచింది రాజస్థాన్ ముందు.
అనంతరం బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్. యంగ్ ప్లేయర్స్ ఓపెనర్స్ యశస్వి జైశ్వాల్ , వైభవ్ సూర్య వంశీ పోటీపడి ఆడారు. కేవలం 2.5 ఓవర్లలోనే 50 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. జైశ్వాల్ 50 రన్స్ చేస్తే..సూర్యవంశీ కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 ఫోర్లు 4 భారీ సిక్స్ లతో 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురైల్ 53 రన్స్ తో పోరాడినా ఫలితం లేకుండా పోయింది.