చెన్నై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో సూపర్ షో చేశాడు యంగ్ బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. చెన్నై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ను ఉతికి ఆరేసిన ఈ కుర్రాడు చెన్నై బౌలర్లకు ఝలక్ ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 రన్స్ లక్ష్యం నిర్దేశించింది.
అనంతరం భారీ టార్గెట్ ఛేదన కోసం బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ , వైభవ్ సూర్య వంశీ ఎక్కడా తగ్గలేదు. బంతులను బౌండరీ లైన్ దాటించడమే పనిగా పెట్టుకున్నారు. యశస్వి రెచ్చి పోయాడు. తను 36 రన్స్ చేశాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ లో సూపర్ షాట్స్ ఆడాడు వైభవ్ సూర్యవంశీ.
తను కేవలం 33 బాల్స్ ఎదుర్కొన్నాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు కొట్టాడు. 57 రన్స్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ చేతికి చిక్కాడు. ఇదే సమయంలో 2వ వికెట్ భాగస్వామ్యానికి 98 పరుగులు జోడించారు వైభవ్ కెప్టెన్ సంజూ శాంసన్. ఆ తర్వాత రియాన్ పరాగ్ నిరాశ పరిచినా మిగతా పనిని కానిచ్చేశాడు ధ్రువ్ జురైల్. కళ్లు చెదిరే షాట్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు.
ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ కు ఊరట లభించగా చెన్నైకి నిరాశే మిగిలింది. ఇరు జట్లు ఈసారి ఆశించినంత మేర ఆడలేదు. మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాయి.