దీపికా ప‌దుకొనేకు వంగా స్ట్రాంగ్ కౌంట‌ర్

త‌న‌కు సినిమానే అన్నీ అంటూ కామెంట్స్

బాలీవుడ్ లో ఇప్పుడు ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి, న‌టి దీపికా ప‌దుకొనే మ‌ధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకునేంత స్థాయికి వెళ్లింది. త‌న‌ను పేరు పెట్టి పిల‌వ‌కుండానే వంగా సందీప్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

త‌ను ప్ర‌భాస్ తో సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు వంగా. స్పిరిట్ పేరు కూడా సినిమాకు టైటిల్ ను ఖ‌రారు చేశాడు. ఈ మేర‌కు క‌థ కూడా ప్ర‌భాస్ కు చెప్పాడు. ముందుగా దీపికా ప‌దుకొనేను అనుకున్నారు.
ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ త‌న‌ను కాద‌ని యానిమల్ మూవీలో కీ రోల్ పోషించిన త్రిప్తి దిమ్రీని ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి. దీంతో త‌ను త‌ప్పుకోవ‌డానికి తాను కార‌ణం కాద‌ని, దీనికంత‌టికీ డైరెక్ట‌రే కార‌ణ‌మంటూ దీపికా ప‌దుకొనే త‌న టీం ద్వారా పేర్కొంది.

దీంతో ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారి తీశాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదంతా పీఆర్ స్టంట్స్ అని గ్ర‌హించిన సందీప్ రెడ్డి వంగా దీపికాకి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.
‘ఎక్స్’ వేదిక‌గా దీపిక పేరు ఎత్తకుండానే ట్వీట్ చేయ‌డం మ‌రింత ఆసక్తిని రేపేలా చేసింది. ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుందన్నాడు. త‌న‌కు సినిమానే అన్నీ అని స్ప‌ష్టం చేశాడు. . అది కొందరికి ఎప్ప‌టికీ అర్థం కాదంటూ ఫైర్ అయ్యాడు వంగా సందీప్ రెడ్డి.

Comments (0)
Add Comment