Vijay Deverakonda : జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ భారతమంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇందుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు సినీ రంగానికి చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు. తాజాగా ఈ ఘటనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ. కోలీవుడ్ కు చెందిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం రెట్రో. దీనిని జ్యోతిక, సూర్య నిర్మించారు.
Vijay Deverakonda Responds on Pahalgam Attack
ఇందులో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డేతో పాటు సూర్య కీ రోల్స్ పోషించారు. ఈ సినిమాను మే1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తెలుగులో దీనిని ముందుకు తీసుకు వస్తున్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ. రెట్రో మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదంపై. దేశాన్ని తమ స్వలాభం కోసం విడదీసిన ఆనాటి ఆంగ్లేయులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తానీయులను నిట్ట నిలువునా కాల్చి పారేయాలంటూ మండిపడ్డారు.
ఈ ఘటన తనను కలిచి వేసిందన్నాడు. ప్రత్యేకించి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ విరోచిత గాథను తెరకెక్కించిన ఛావా సినిమాను ప్రత్యేకంగా ప్రస్తావించాడు నటుడు. ఆ మూవీ చూశాక నాలో రక్తం మరిగి పోయిందన్నాడు. ఇలాంటి దేశ ద్రోహులు ఉన్నంత కాలం మనకు ప్రమాదమేనని హెచ్చరించాడు. ఈ విపత్కర సమయంలో ప్రతి భారతీయుడు జాతి, కులం, మతాలకు అతీతంగా ఏకతాటిపై పోరాడాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చాడు. ఇక రెట్రో బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని జోష్యం చెప్పాడు విజయ్ దేవరకొండ.
Also Read : Sarangapani Jathakam Sensational :నవ్వుల నజరానా కాసుల ఖజానా
Hero Vijay Deverakonda-Pahalgam : పాకిస్తాన్ ఉగ్రవాదం దేవరకొండ ఆగ్రహం
నిప్పులు చెరిగిన టాలీవుడ్ నటుడు
Vijay Deverakonda : జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ భారతమంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇందుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు సినీ రంగానికి చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు. తాజాగా ఈ ఘటనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ. కోలీవుడ్ కు చెందిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం రెట్రో. దీనిని జ్యోతిక, సూర్య నిర్మించారు.
Vijay Deverakonda Responds on Pahalgam Attack
ఇందులో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డేతో పాటు సూర్య కీ రోల్స్ పోషించారు. ఈ సినిమాను మే1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తెలుగులో దీనిని ముందుకు తీసుకు వస్తున్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ. రెట్రో మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదంపై. దేశాన్ని తమ స్వలాభం కోసం విడదీసిన ఆనాటి ఆంగ్లేయులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తానీయులను నిట్ట నిలువునా కాల్చి పారేయాలంటూ మండిపడ్డారు.
ఈ ఘటన తనను కలిచి వేసిందన్నాడు. ప్రత్యేకించి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ విరోచిత గాథను తెరకెక్కించిన ఛావా సినిమాను ప్రత్యేకంగా ప్రస్తావించాడు నటుడు. ఆ మూవీ చూశాక నాలో రక్తం మరిగి పోయిందన్నాడు. ఇలాంటి దేశ ద్రోహులు ఉన్నంత కాలం మనకు ప్రమాదమేనని హెచ్చరించాడు. ఈ విపత్కర సమయంలో ప్రతి భారతీయుడు జాతి, కులం, మతాలకు అతీతంగా ఏకతాటిపై పోరాడాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చాడు. ఇక రెట్రో బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని జోష్యం చెప్పాడు విజయ్ దేవరకొండ.
Also Read : Sarangapani Jathakam Sensational :నవ్వుల నజరానా కాసుల ఖజానా