18 ఏళ్ల బంధం తెంచుకున్న వైనం

భారంగా బెంగ‌ళూరుకు విరాట్ కోహ్లీ

ముంబై – టాప్ ఇండియ‌న్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా తాను టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. దాదాపు క్రికెట్ ఆట‌తో త‌ను 18 ఏళ్ల పాటు బంధాన్ని కొన‌సాగించాడు. అయితే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జ‌ట్టులో కీల‌క భాగ‌స్వామిగా ఉన్నాడు. ఆట‌గాడిగా, కెప్టెన్ గా త‌ను ఎంద‌రికో స్పూర్తిగా నిలిచాడు. త‌ను పూర్తిగా నిబ‌ద్ద‌త‌తో ఆట‌ను ఆస్వాదించాడు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావ‌డంతో ముంబైలో ఉన్న విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు, ఆర్సీబీ త‌ర‌పు నుంచి ఆడేందుకు భారంగా ఇంటి నుంచి బ‌య‌లు దేరి వెళ్లాడు. ఆయ‌న‌కు త‌న భార్య అనుష్క శ‌ర్మ తోడుగా ఉన్నా ఎందుక‌నో కానీ త‌ను మాత్రం చాలా బేల‌గా క‌నిపించాడు. త‌న జీవితంలో క్రికెట‌ర్ ను కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు. దానిని నిజం చేసి చూపించాడు.

త‌న ఏకైక ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఆర్సీబీకి ఈసారైనా ఐపీఎల్ క‌ప్ అందించాల‌న్నదే త‌న ముందున్న టార్గెట్ అన్నాడు. ప్రైవేట్ ఫ్లైట్ లో త‌న ఫ్యామిలీతో బెంగ‌ళూరుకు చేరుకున్నాడు. ఎలాంటి దుర్బేద్య‌మైన ల‌క్ష్య‌మైనా స‌రే దానిని ఛేదించేంత దాకా వ‌ద‌ల‌ని మ‌న‌స్త‌త్వం విరాట్ కోహ్లీది. ఇదిలా ఉండ‌గా కోహ్లీ, అనుష్క‌ల విజువ‌ల్స్, ఫోటోలు వైర‌ల్ గా మారాయి . సోష‌ల్ మీడియాను షాక్ చేస్తున్నాయి.

Comments (0)
Add Comment