ఎన్నాళ్లకెన్నాళ్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అనుకున్నది సాధించింది. సుదీర్గ విరామం తర్వాత ఐపీఎల్ 2025 కప్ ను ముద్దాడింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన పోరులో చివరి బాల్ వరకు ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాళ్లు పోరాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లు జోషల్ వుడ్, కృనాల్ పాండ్యా, షెఫర్డ్ సూపర్ షో చేశారు. కట్టుదిట్టంగా బంతులను వేస్తూ బోల్తా కొట్టించారు.
ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి. తను ముందు నుంచీ ఆర్సీబీని అంటి పెట్టుకుని వచ్చాడు. మైదానంలో గెలిచాక కన్నీళ్లను ఆపుకోలేక పోయాడు. ఈ మ్యాచ్ లో 43 కీలకమైన పరుగులు చేశాడు. జట్టు విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ చేసిన ప్రయత్నం ఫలించ లేదు. గెలుపు ముంగిట కేవలం ఆరు పరుగుల దూరంలోనే మిగిలి పోయింది. రియల్ ఛాంపియన్ గా నిరూపించుకుంది రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ.
విరాట్ కోహ్లీ తను నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ ఆట అన్నాక తప్పుకోవడం మంచిదేనని వెల్లడించాడు. తనలో ఆడే సత్తా ఉన్నా గంభీర్ కారణంగా వైదొలిగాడన్న అపవాదు ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 191 పరుగుల లక్ష్య ఛేదనలో జస్ట్ సిక్స్ రన్స్ తేడాతో పరాజయం పొందడం నిరాశకు గురి చేసింది పంజాబ్ ఫ్యాన్స్ ను. శశాంక్ సింగ్ 30 బంతులు ఎదుర్కొని 61 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. జోష్ ఇంగ్లీష్ 23 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు ఒక ఫోర్ ఉంది.