మహారాష్ట్ర – మంత్రి పొంగూరు నారాయణ మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లను పరిశీలించేందుకు ప్రస్తుతం అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర లోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించారు. దాని పనితీరు గురించి ఆరా తీశారు. ప్రతి రోజూ చెత్త నుంచి 14 మెగావాట్ల విద్యుత్ ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతోందంటూ ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
ఇక్కడ విద్యుత్ తో పాటు బయో గ్యాస్ నూ ఉత్పత్తి చేస్తుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు పొంగూరు నారాయణ. దీని వల్ల విద్యుత్, గ్యాస్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగం పై మంత్రి నారాయణ కు వివరించారు పింప్రీ చించివాడ్ కార్పొరేషన్ అధికారులు.ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు నెలకొల్పుతున్నట్లు ఈ సందర్బంగా చెప్పారు మంత్రి .
ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్ ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్ ను ఎంపిక చేయడంలో భాగంగా ఆయా రాష్ట్రాలలో పర్యటించడం జరుగుతోందన్నారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు, చెత్త నిర్వహణ విధానాలను పరిశీలించారు. మంత్రి నారాయణ తో పాటు ప్లాంట్ ల సందర్శనకు వెళ్లారు స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు.