యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా. నిఘా వర్గాలు కీలక సమాచారం మేరకు తనను అదుపులోకి తీసుకుంది. తన బండారం బయట పడింది. ఇండియాలో ఉంటూ యూట్యూబర్ గా పేరు పొందింది. చివరకు తను చేసింది ఏమిటంటే భారత దేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని దాయాది పాకిస్తాన్ కు చేరవేస్తోందని గుర్తించింది. అంతే కాదు యూట్యూబర్ పేరుతో గూఢచర్యం నిర్వహిస్తూనే ఇండియాలోని హైదరాబాద్ లో లింకు కూడా కలిగి ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఏజెంట్లతో సమాచారాన్ని పంచుకోవడంతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఛానల్ ను స్టార్ట్ చేసింది. తనకు మూడున్నర లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారని తేలింది. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాకు కూడా 1,32,000 మంది అనుచరులు కలిగి ఉన్నారు. తను వ్లోగర్ పేరుతో పాకిస్తాన్ , చైనా, ఇండోనేషియా దేశాలను పర్యటించింది. ఇందుకు సంబంధించిన ట్రావెల్ వీడియోలను షేర్ చేసింది.
ఈ వీడియోలు రెండు నెలల క్రితం జ్యోతి మల్హోత్రా పోస్ట్ చేసింది. ట్రావెలాగ్ల ద్వారా పాకిస్తాన్ కు మద్దతుగా అనేక అంశాలను చిత్రీకరించింది. ఇందుకు విదేశీ ఏజెంట్లను ఉపయోగించినట్లు తేలింది.
తను అట్టారి-వాఘా సరిహద్దును దాటడం, లాహోర్లోని అనార్కలి బజార్ను అన్వేషించడం, బస్సు ప్రయాణం చేయడంతో పాటు కటాస్ రాజ్ గుడిని సందర్శించింది. ఇన్ స్టా లో ఇష్క్ లాహోర్ అనే క్యాప్సన్ చేర్చింది. మొత్తంగా తన లింకులు హైదరాబాద్ లో ఉండడం విస్తు పోయేలా చేసింది. తన బండారం పూర్తిగా అరెస్ట్ చేయడంతో బయట పడింది.