దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని, సిఈఓ కావ్య మారన్. తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్తల వారసురాలు తను. వేల కోట్ల ఆస్తులకు తను ప్రతినిధి. ఉన్నత విద్యను చదువుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఎవరికీ తెలియదు. కానీ అనుకోకుండా ఎప్పుడైతే ఎస్ ఆర్ హెచ్ ను కొనుగోలు చేసిందో ఆనాటి నుంచి నేటి దాకా తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారి పోతోంది.
కారణం కోట్లాది ఆస్తులు, లెక్కించలేనంత కోట్లు, వందలాది వాహనాలు, వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు తను ఓనర్. అంతే కాదు నాయకత్వ నైపుణ్యాలను పుణికి పుచ్చుకుంది. ప్రతిభ పరంగా టాప్. టాప్ మేనేజ్మెంట్ కాలేజీలో ఎంబీఏ చేసింది. అనుకోకుండా ఐపీఎల్ లో తళుక్కున మెరిసింది. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇందుకు కారణం కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో డేటింగ్ చేస్తోందని, వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమకు దాదాపు ఏడాది కాలం కూడా పూర్తయినట్లు టాక్.
ఇంతకీ కావ్య మారన్ కథేంటి..తనకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి. తనకు ముందు నుంచి క్రికెట్ అంటే పిచ్చి. అందుకే వందల కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ జట్టును కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఆ జట్టు ఆశించిన మేర ఆడలేదు. కళానిధి మారన్ కూతురు. సన్ పిక్చర్స్ లాంటి భారీ సంస్థలన్నీ వారివే. ఆసియా ఖండంలోనే ప్రముఖ మీడియా సంస్థ సన్ నెట్ వర్క్ యజమాని తన తండ్రి.
తన తల్లి కావేరీ ఆరన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. దేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న మహిళగా గుర్తింపు పొందారు. కావ్య మారన్ ఆగస్టు 6 , 1992లో పుట్టింది.