బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కాదు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాలి

అన్న‌ను ఏకి పారేసిన సోద‌రి వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌న‌గ‌రం జిల్లా – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. త‌న సోద‌రుడు, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను ఎలా ప‌రామ‌ర్శిస్తాడంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి పద్ద‌తి కాద‌న్నారు. గురువారం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. నేరాలు చేసిన వారిని కంట్రోల్ చేయాల్సింది పోయి ప్రోత్స‌హిస్తూ ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. విచిత్రం ఏమిటంటే విగ్ర‌హాలు క‌ట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేయాల‌ని, కానీ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డం కాద‌న్నారు. త‌ను బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి..అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. దగ్గరుండి బల ప్రదర్శనలు చేయించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్ కి మాత్రమే ఆంక్షలు పెడుతున్నారంటూ వాపోయారు.

జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవ‌నే విష‌యంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. తాము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్ లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తున్నార‌న్నారు. ఏపీలో కూట‌మి పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా అదుపు త‌ప్పింద‌న్నారు.

Comments (0)
Add Comment